ఏపీలో కొత్తగా 4,169 కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 53 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 12,416కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,376 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,91,056 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,12,80,302 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. తూర్పు గోదావరి, ప్రకాశం, జిల్లాల్లో ఆరుగురు, కృష్ణా, శ్రీకాకుళం, జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో నలుగురు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు, గుంటూరు, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.