ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా… 3 వేల దిగువకు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 44 మంది మృత్యు వాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,363కు చేరింది. 24 గంటల్లో 7,504 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకు 17,82,680 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో పోరాడుతూ చిత్తూరు జిల్లాలో 10 మంది, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.