ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,544 మందికి పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12,109 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 10,288 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,43,176కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,07,36,435 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,387, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, గుంటూరులో కరోనాతో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాల్లో ముగ్గురు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.