ఏపీలో విజృంభిస్తోన్న కరోనా…కొత్తగా 1,941 కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా 1,941 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 9,10,943కి చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యవాఖ బులెటిన్లో వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు. ప్రశాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కొవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది. ఒక్కరోజులో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 11,809 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,70,771 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.