ఏపీలో కొత్తగా 20,937 కేసులు… 104 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 92,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9,904కి చేరింది. ఇవాళ కరోనా నుంచి 20,811 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. కరోనా కారణంగా చిత్తూరులో 15 మంది మృతి చెందగా.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిలాల్లో 9 మంది, కృష్ణా జిల్లాల్లో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు.