ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,994 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,90,926 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే 104 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 18,373 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకు 13,79,837 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,86,76,22 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మహమ్మారి కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10 మంది, అనంతపురంలో 9 మంది, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలని విధిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరించారు.