ఏపీలో కొత్తగా 21,320 కేసులు.. 99 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,253 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21,320 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 14,75,372కి పెరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 21,274 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 12,54,291 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,81,40,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా బారినపడి చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలో 10 మంది చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 99 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 9,580 మంది మరణించారు.