ఏపీలో కరోనా విజృంభణ.. 96 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,10,571 శాంపిల్స్ పరీక్షించగా.. 20,065 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. పాజిటివిటీ రేటు 19.75 శాతం ఉండగా, అత్యధికంగా 96 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే 6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయాయని తెలిపారు. చిత్తూరులో అత్యధికంగా 2,269, తూర్పుగోదావరి 2,370, విశాఖ 2525 అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14 మంది చనిపోగా, విశాఖలో 12 మంది మృత్యువాతపడ్డారు.