ఏపీలో కొత్తగా 18,561.. 100కు పైగా

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 73,749 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 18,561 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో 109 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 9,481 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్ కేసలున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,33,017 మంది రికవరీ అయ్యారు. కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 16 మంది, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 10 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, ప్రకాశం జిల్లాల్లో 4, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.