రాష్ట్రపతి ముర్ము తో పలు దేశాల అగ్రనేతల భేటీ

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా ఢిల్లీ విచ్చేసిన పలు దేశాల అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్తో స్నేహబంధాన్ని దృఢపరుచుకోవడం, వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు చర్చించుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ఞు, మారిషస్ అధ్యక్షుడు ప్రవింద్ కుమార్ జగన్నాథ్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ రాష్ట్రపతి భవన్కు వచ్చిన వారిలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచకోవాలని అభిప్రాయపడ్డారు.