కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. తెలుగు రాష్ట్రాల నుంచి

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటి వరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచిగూడ`యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్-గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్టవ్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.