సోనియా గాంధీని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ

ఈ నెల 12న జరిగే తన చిన్న కుమారుడి పెళ్లికి రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలోని టెన్ జన్పథ్లోని సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం పెళ్లి శుబలేఖను అందజేశారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడికి, రాధిక మార్చెంట్కు ముంబై లోని బాంద్రా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహం జరగనుంది.