ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిరచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తమిళనాడులో 63.2 శాతం పోలింగ్ నమోదు కాగా, రాజస్థాన్లో 50.3 శాతం, ఉత్తరప్రదేశ్ 57.5 శాతం, మధ్యప్రదేశ్ 63.3 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్లో 67.5, సిక్కింలో 64.7 శాతం చొప్పున నమోదైంది.