బడ్జెట్ లో ఆ నాలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం
కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్లో రూ.25 వేల కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000 కోట్లు, కేరళలో రూ.65వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు కారిడార్ ఏర్పాటు కానుంది.













