ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు…

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతంగా నిలిచిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు దుబాయ్లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. భారత్లో ఐపీఎల్ 14వ సీజన్కు సంబంధించి 29 మ్యాచ్లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షూరు అవుతాయి. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఐపీఎల్లో మిలిగిన మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వచ్చేది అనుమానంగా మారింది. తాము రాలేమంటూ ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సంకేతాలిచ్చారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.