ఇదాహో లో ఆరో తరగతి బాలిక కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదావో రాష్ట్రంలోని రిగ్బి మిడిల్ స్కూల్లో ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఆరో తగరతి చదువుతున్న బాలిక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, మరొకరు స్కూల్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు వెల్లడించారు.