తొలి డోసు తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనా టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జెనీవాలోని యూనివర్సిటీ హాస్పిటల్లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన పేరు రిజిస్టర్ చేసుకున్న 56 ఏండ్ల టెడ్రోస్.. తన వంతు వచ్చిందని సమాచారం ఇవ్వడంతో వెళ్లి టీకా వేయించుకున్నాడు. ప్రజలంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకాలు తీసుకొని ప్రాణాలను కాపాడుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.