కోవిడ్ వ్యాక్సినేషన్ ఫై మోదీ సమీక్ష

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా ఆవిష్కరించిన కోవిడ్-19 వ్యాక్సిన్ మరిన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం చవక ధరలో సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే అన్ని దేశాల చూపు భారత్ వైపే ఉంది. ఇప్పటికే టీకా ధర, పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల అధినేతలందరూ మీ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. కాగా తాము రూపొందించిన వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు టీకాను 70 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోరేజ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశం గురించి ఇప్పటికే రాష్ట్రాలతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ టీకాను భద్రపరిచేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీల వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిగా చేశారు.