తెలంగాణలో 2,216 మందికి పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతున్నది. విస్త•తంగా పరిక్షలు, సకాలంలో చికిత్స అందిస్తుండటంతో రికవరీ రేటు 79.2 శాతానికి చేరుకున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.57 లక్షల మందికి కరోనా సోకగా, అందులో లక్షా 24 వేల మంది వరకు కోలుకున్నారు. మరో 31 వేల మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 2,216 మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 341 కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్కు తోడు ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా 11 మంది మరణించారు.






