తెలంగాణలో 1.50 లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,534 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. బుధవారం ఒక్కరోజే 2,071 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,17,143. రాష్ట్రంలో ప్రస్తుతం 32,106 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 25,066 మంది ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 19,53,571కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.






