తెలంగాణలో కొత్తగా 2,511 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. ఒక్కరోజే 2,579 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,04,603. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,915. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.24 శాతంగా ఉండగా, రాష్ట్రంలో 75.5 శాతంగా ఉంది. భారత్లో మరణాల రేటు 1.73 శాతం ఉండగా, తెలంగాణలో 0.63 శాతం ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 62,132 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 16,67,653కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.






