ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 58,187 నమూనాలను పరీక్షించగా 8,368 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 5,06,493కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 70 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, గుంటూరు 9,చిత్తూరు 8, కడప 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, నెల్లూరు 5, అనంతపురం 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,487కి చేరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,487కి చేరింది. మరోవైపు ఒక్కరోజులో 10,055 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,66,077 నమూనాలను పరీక్షించారు.






