ఏపీలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసులు సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశార. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా, కొవిడ్తో తాజాగా 82 మంది మృతి చెందారు. మొత్తం 2,732 మంది మరణించారు.
ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, గుంటూరు, కడప జిల్లాల్లో 7 మంది, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 6 మంది, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.






