ఏపీలో 7,956 కొత్త కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకు సుమారు 10 వేల కేసులు వస్తుండగా, ఈ రోజు ఆ సంఖ్య తగ్గింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 61,529 నమూనాలను పరీక్షించగా 7,956 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. 24 గంటల వ్యవధిలో 60 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది. ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,764 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.






