24 గంటల్లో 76,472 కేసులు, 1021 మరణాలు
భారత్లో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 76,472 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 34,63,973కు పెరిగింది. వీరిలో 7,52,424 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 26,48,998 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. ఇక కొత్తగా 1,021 మంది మరణించడంతో, మృతుల సంఖ్య 62,550కి పెరిగింది. వెయ్యికి పైగా మరణాలు సంభవించడం వరుసగా ఇది నాలుగోరోజు. రికవరీ రేటు 76.47 శాతంగా.. మరణాల రేటు 1.81 శాతంగా ఉంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 9,28,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.






