తెలంగాణలో 2,892 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,892 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,30,589కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందగా, మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 846 కి చేరింది. మంగళవారం 2,240 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 97,402 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,341 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్లో పేర్కొంది. మరో 25,271 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 477 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 234, మేడ్చల్లో 192, నల్గొండ జిల్లాలో 174 కేసులు నమోదయ్యాయి.






