తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62,649 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,47,642 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. న్ని ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 916కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,485 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,15,072కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,654 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 18,90,554 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.






