తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,923 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,382 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 906కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,346 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,12,587కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,670కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 18,27,905కి చేరింది.






