తెలంగాణలో కొత్తగా 1,842 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 373 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,091 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఆరుగురు మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 761కు చేరింది. ఇవాళ, 1,825 మంది వైరస్బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 82,411 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22,919 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 16,482 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,282 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 9,68,121 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 373, నిజామాబాద్ జిల్లాలో 158, కరీంనగర్ జిల్లాలో 134, సూర్యాపేట జిల్లాలో 113, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు బయటపడ్డాయి.






