Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు జీవిత ప్రయాణం సింహావాలోకనం చేసుకుంటే…

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) (83) ఆదివారం కన్నుమూశారు. 750 పైగా చిత్రాల్లో నటించి, ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. విలక్షణమైన నటనతో, విభిన్న పాత్రలతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం… ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడుగా కోట శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు.
బ్యాంక్ ఉద్యోగం వదిలి నటనపై మక్కువతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కోట, తన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలక్షణమైన నటనతో, విభిన్నమైన పాత్రలతో సినీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. ఎలాంటి పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి, వర్సటైల్ యాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచారు. తన విలనీతో భయపెట్టినా, కామెడీతో కడుపుబ్బా నవ్వించినా, సెంటిమెంట్ తో కంటతడి పెట్టించినా.. అది ‘కోటా’కే చెల్లింది. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లఖించుకున్న కోటా..ఈ రోజు ఆదివారం(జులై 13) ఉదయం కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు సినీ రంగంలో అడుగుపెట్టకముందు కొంతకాలం స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న మక్కువతో ఆ జాబ్ మానేసి, పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. కోటా నాటకాలలో చురుగ్గా పాల్గొనేవారు. నాటక రంగంలో ఉన్న అనుభవం, సినిమాల్లో ఆయన నటనకు ఒక బలమైన పునాది వేసింది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్పై ఈ నాటకరంగ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.చిరంజీవి తొలి చిత్రంతోనే ఎంట్రీ…
‘ప్రాణం ఖరీదు’ అనే నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్న నిర్మాత క్రాంతికుమార్.. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా 1978లో కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. ఇదే మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమాగా రికార్డులకెక్కింది. అయితే కోటా 1985 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘ప్రతిఘటన’ చిత్రంలో ఆయన పోషించిన మినిస్టర్ కాశయ్య పాత్ర ఆయన కెరీర్ కు బలమైన పునాది వేసింది.
కోటా శ్రీనివాసరావు తన సినిమాల్లో డైలాగ్ డెలివరీకి, యాసకు ప్రత్యేకత తీసుకొచ్చేవారు. దర్శకులతో చర్చించి డైలాగులకు మెరుగులు దిద్దుకునేవారని చెబుతారు. ‘ప్రతిఘటన’ సినిమాలో ‘నమస్తే తమ్మీ’ అంటూ తెలంగాణ యాసతో అదరగొట్టారు. దీని కోసం ఆయన పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు ఈ పాత్ర ఎంతో దోహదం చేసింది. తనను నటుడిని చేసింది తెలంగాణ మాండలీకమే అని కోటా చెప్పేవారు. అదే యాసలో రామాయణం చెప్పి ఆకట్టుకున్నారు. సినిమాల్లో ఆయన పలికిన ‘వీడెవండీ బాబూ..’, ‘అయ్య నరకాసురా..’, ‘నాకేంటి ..మరి నాకేంటి’, ‘గదైతే నేను ఖండిస్తున్న’ వంటి కొన్ని డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి.
టాలీవుడ్ సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు ఏంచేసేవారో తెలుసా?.. ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలు ఇవే! 750కి పైగా సినిమాలలో నటించిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఎలాంటి పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి, వర్సటైల్ యాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచారు. తన విలనీతో భయపెట్టినా, కామెడీతో కడుపుబ్బా నవ్వించినా, సెంటిమెంట్ తో కంటతడి పెట్టించినా.. అది ‘కోటా’కే చెల్లింది. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లఖించుకున్న కోటా ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్న నిర్మాత క్రాంతికుమార్.. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా 1978లో కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. ఇదే మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమాగా రికార్డులకెక్కింది. అయితే కోటా 1985 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘ప్రతిఘటన’ చిత్రంలో ఆయన పోషించిన మినిస్టర్ కాశయ్య పాత్ర ఆయన కెరీర్ కు బలమైన పునాది వేసింది.
కోటా శ్రీనివాసరావు తన సినిమాల్లో డైలాగ్ డెలివరీకి, యాసకు ప్రత్యేకత తీసుకొచ్చేవారు. దర్శకులతో చర్చించి డైలాగులకు మెరుగులు దిద్దుకునేవారని చెబుతారు. ‘ప్రతిఘటన’ సినిమాలో ‘నమస్తే తమ్మీ’ అంటూ తెలంగాణ యాసతో అదరగొట్టారు. దీని కోసం ఆయన పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు ఈ పాత్ర ఎంతో దోహదం చేసింది. తనను నటుడిని చేసింది తెలంగాణ మాండలీకమే అని కోటా చెప్పేవారు. అదే యాసలో రామాయణం చెప్పి ఆకట్టుకున్నారు. సినిమాల్లో ఆయన పలికిన ‘వీడెవండీ బాబూ..’, ‘అయ్య నరకాసురా..’, ‘నాకేంటి ..మరి నాకేంటి’, ‘గదైతే నేను ఖండిస్తున్న’ వంటి కొన్ని డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి.
ఓవైపు కామెడీ.. మరోవైపు క్రూరమైన విలనీ..
కోటా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ‘అహ నా పెళ్లంట’ ఒకటి. పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు ‘శత్రువు’ చిత్రంలో వెంకటరత్నం అనే కామెడీ విలన్ గా.. మరోవైపు ‘గణేష్’ మూవీలో సాంబ శివుడు అనే సీరియస్ విలన్గా నటించి మెప్పించారు. నవ్విండంలోనైనా, ఏడిపించడంలోనైనా, విలనిజం పండించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించారు. గురు నారాయణ(గాయం), నల్ల శీను(రక్షణ), అల్లాడీన్(మనీ), పోతురాజు(మామగారు), తాడి మట్టయ్య(హలో బ్రదర్) పాత్రలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాయి. తండ్రిగా, తాతగా, ముత్తాతగా, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా, కోడలిని పెళ్లి చేసుకోవాలనుకునే కపట మామగా, కామెడీ విలన్ గా, నవ్వించే పోలీసుగా, భయపెట్టే మాంత్రికుడిగా.. ఇలా ఎన్నో పాత్రలకు ఆయన జీవం పోశారు.ఇతర భాషల్లోనూ అలరించిన కోటా..ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా క్యారక్టర్ ఆర్టిస్టుగా నిలిచారు. తాను నటించే ప్రతి పాత్రకు పది నుండి పదిహేను శాతం మాత్రమే తన మార్కును జోడిస్తానని, మిగిలినదంతా దర్శకుడి విజన్కే వదిలేస్తానని కోటా చెబుతుంటారు.కోటా శ్రీనివాసరావు కేవలం నటుడిగానే కాదు, గాయకుడిగా రెండు పాటలు పాడారు. ‘సిసింద్రీ’ సినిమాలో ‘ఓరి నాయనో’, ‘గబ్బర్ సింగ్’ మూవీలో ‘మందు బాబులం’ పాటలను ఆయన స్వయంగా ఆలపించారు. ఇక ఆయన తన కెరీర్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. 2015లో భారత ప్రభుతం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. కోటా గొప్ప నటుడిగానే కాకుండా, ఎంతో నిరాడంబరంగా, క్రమశిక్షణతో సినీ ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.