కొండగట్టు అంజన్నకు దర్శించుకున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి బయలదేరిన పవన్కు మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.