Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Ysrcp celebrates two years of ys jagans rule

అందరి సహకారంతోనే రెండేళ్ళ పాలన దిగ్విజయం

  • Published By: cvramsushanth
  • June 1, 2021 / 05:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ysrcp Celebrates Two Years Of Ys Jagans Rule

రాష్ట్రంలోని ప్రజలందరి సహకారంతో తమ ప్రభుత్వం రెండేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగిందని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి అన్నారు. వైఎస్సార్‍సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. తమ రెండేళ్ళపాలనలో 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’’ సీఎం జగన్‍ అన్నారు.

Telugu Times Custom Ads

వై.ఎస్‍. జగన్‍ పాలనకు పేరు తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా వై.ఎస్‍. జగన్‍మోహన్‍ రెడ్డి రెండేళ్ళ పాలనా కాలంలో ముఖ్యమైనది గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు. పాలనలో విప్లవాత్మక మార్పులకు ఈ ఏర్పాటు శ్రీకారం చుట్టింది.  గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు.. గ్రామాలలో ఎవరికి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందో ఆ ఊళ్లో వాళ్లకు సైతం సరిగా తెలిసేది కాదు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందకపోతే ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయంలో ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ కనిపించేలా నోటీసు బోర్డులో పెడుతున్నారు. ఎవరి దరఖాస్తును అయినా తిరస్కరిస్తే, అందుకు గల కారణాన్ని కూడా సూచిస్తూ వివరాలు నోటీసు బోర్డులో ఉంచుతున్నారు. సచివాలయాల్లో ప్రస్తుతం ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్‍ పద్ధతిలోనే అమలవుతున్నాయి. ప్రతి చోటా రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్‍, ఒక ల్యామినేషన్‍ మిషన్‍, ఐరిష్‍ స్కానింగ్‍ మిషన్‍, ప్రతి ఉద్యోగి వద్ద ఒక ఫింగర్‍ ప్రింట్‍ మిషన్‍ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయాల కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా చేపట్టింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సమానంగా 545 రకాల సేవలు అందిస్తోంది. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సచివాలయాల్లో పని చేసేందుకు 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించారు. ఆరు నెలల సమయంలోనే వాటిని భర్తీ కూడా చేశారు. ఇన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్‍ ఇచ్చి, త్వరితగతిన భర్తీ చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయింది. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడితే.. చిన్న తప్పు కూడా దొర్లకుండా యూపీఎస్‍సీ స్థాయిలో రాత పరీక్షలు నిర్వహించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోపే ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందజేశారు.  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పని తీరును ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాయి. కేంద్ర ప్రభుత్వం సహా ఎన్నో సంస్థలు ప్రశంసించాయి. జగన్‍ పాలనలో ఇది ఒక ప్రత్యేకమైనదిగా నిలిచింది. 

అలాగే కొన్ని పథకాలు కూడా జగన్‍కు మరింత పేరును తీసుకువచ్చాయి. ప్రజలకు దగ్గర చేశాయి. పెన్షన్‍ మొదలు ఏ పథకమైనా గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు.అమ్మఒడి వలంటీర్‍ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాలు ఇంటివద్దకే రేషన్‍ సరుకులు ఆరోగ్యశ్రీ కాపునేస్తం వైఎస్‍ఆర్‍ రైతు భరోసా వాహనమిత్ర జగనన్న విద్యాదీవెన వసతి దీవెన చేయూత వంటి కార్యక్రమాలు జగన్‍ ను ప్రజలకు చేరువ చేశాయి.

హెల్త్ హబ్‍ల ఏర్పాటు

ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక ద•ష్టి సారించింది. కరోనా నేపథ్యంలో ఎదురైన సవాళ్లను ద•ష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హబ్‍లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కోవిడ్‍పై సమీక్ష  సీఎం వైఎస్‍ జగన్‍.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‍ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందని అంటూ, జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్ హబ్‍ లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్ హబ్‍లను ఏర్పాటు చేయాలని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‍లు ఉండాలని సూచించారు. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాలని ఆదేశించారు. మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలని సీఎం జగన్‍ సూచించారు.  దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్‍ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‍ కాలేజీలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వపరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు కూడా మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుందన్నారు. ఒకనెలరోజుల్లో కొత్త పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం జగన్‍ ఆదేశించారు.

 

Tags
  • AP
  • celebrates
  • Rule
  • two years
  • YS Jagan

Related News

  • Vallabhaneni Vamsi Says Goodbye To Politics

    Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?

  • Jagan Limited To Promises Babu Moving Forward With Development

    Chandrababu: హామీలకే పరిమితమైన జగన్.. అభివృద్ధితో ముందుకు సాగుతున్న బాబు..

  • Ttd Invited Cm Chandrababu For Tirumala Brahmotsavams

    TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

  • Dbv Swamy Comments On Bhumana

    DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి

  • Sajjala Bhargav Reddy Attends Cid Inquiry

    CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి

  • Ycp Strategy In Ap Politics

    YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!

Latest News
  • Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
  • Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
  • Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
  • Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
  • Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
  • Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
  • Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
  • Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
  • Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
  • Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer