పెగాసస్ ద్వారా రాష్ట్రానికే కాదు.. దేశ రక్షణకు కూడా

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెగాసస్ను ఉపయోగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామన్నారు. అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు. చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని, కేంద్రాన్ని కూడా కోరతామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో నిలబడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని ఆయన డిమాండ్ చేయాలన్నారు. పెగాసస్ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు, దేశ రక్షణకు విఘాతం కలిగించారన్నారు. చంద్రబాబుపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.