మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత… వాసిరెడ్డి పద్మతో మహిళ కమిషన్ చైర్ పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, ఎంపీలుగ వంగా గీత, చింత అనురాధ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు.













