అగ్రరాజ్యం నుంచి ఏపీకి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించింది. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వీటిని అందజేశారు. ఢిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చారు. వీటితో తూర్పు గోదావరి జిల్లాకు 200, పశ్చిమ గోదావరికి 100, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు 50 చొప్పున తరలించారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి అక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసినందుకు గాను ఏపీ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.