BR Naidu: పాయింట్ బ్లాంక్ లో బెదిరించారు: బీఆర్ నాయుడు సంచలనం
తిరుమల(TTD) వ్యవహారాల విషయంలో టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన కామెంట్స్ చేసారు. తిరుమలపై విష ప్రచారాన్ని ఖండిస్తున్నామన్న నాయుడు.. 2008లో పీపీపీ క్రింద 30.32 ఎకరాల భూమి దేవలోక్ ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగిందని గుర్తు చేసారు. 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్కు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు. ముంతాజ్ హోటల్కు భూమిని ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి బీఆర్ నాయుడు(BR Naidu) గుర్తు చేసారు.
ఆ భూమిని ముంతాజ్ హోటల్ కు ఇవ్వడానికి వీల్లేదని పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామన్న నాయుడు.. ఆ భూమి ఏడు కొండల్లోని భాగం.. సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) సూచనపై ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిందని స్పష్టం చేసారు. ఆ భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని నిర్ణయించామని బీఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు చర్చించారని పేర్కొన్నారు. ఇంకా పేపర్ వర్క్ జరుగుతోంది.. భూమి హ్యాండోవర్ చేయలేదని స్పష్టం చేసారు.
ముంతాజ్ హోటల్కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా..? స్పష్టం చేసారు. అది పవిత్రమైన స్థలం.. ఒక అంగుళం కూడా పోనివ్వం.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంతాజ్ హోటల్కు ఆ భూమిని మీరెందుకిచ్చారో ముందు మీరు సమాధానం చెప్పాలని నిలదీశారు. 13 ఏళ్లుగా సీబీఐ నుంచి తప్పించుకు తిరుగుతున్న దొంగలు మీరని మండిపడ్డారు. మీకు ఈ అంశంపై సీబీఐ విచారణ కోరే అర్హత లేదు.. తప్పు చేశామని లెంపలేసుకుని ముక్కు నేలకు రాయండని సవాల్ చేసారు.
ఈ పాలక మండలి వచ్చినప్పటి నుంచి నీతి నిజాయితీతో పనిచేస్తోంది.. తిరుమల పవిత్రత కాపాడే ఉద్దేశ్యంతోనే మేం పనిచేస్తున్నామన్నారు. తిరుమలపై ప్రతిరోజు బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. అందరూ మీలా దొంగలు ఉండరన్నారు. ఆ 20 ఎకరాలు మీరు ఊరికే ఇవ్వలేదు.. ఏం జరిగిందో మాకు తెలుసని వ్యాఖ్యానించారు. అజయ్ కుమార్ను పాయింట్ బ్లాంక్లో బెదిరించి 20 ఎకరాలు వెనక్కు తీసుకున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు.







