AP Bhavan: ఏపీ భవన్లో ఆక్రమణలు.. సంయమనం పాటించాలని సీఎం సూచన
ఢిల్లీ లోని ఏపీ భవన్ (AP Bhavan) ప్రాంగణంలో ఆక్రమణల తొలగింపు అంశంపై అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. 0.37 ఎకరాల్లో ఆక్రమణలను అధికారులు గుర్తించారు. రెండు ప్రార్థనా మందిరాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సి ఉందని సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని, ప్రజల (Peoples) మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని అధికారులకు (officials) చంద్రబాబు సూచించారు. సీఎం సూచనతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు.













