పులివెందుల టీడీపీ అభ్యర్థి ఖరారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత సతీశ్రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్పై పోటీకి నిలుపనుంది. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిపై కూడా సతీశ్ పోటీ చేయడం విశేషం. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో గత 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.













