ఢిల్లీ యాత్ర రాష్ట్ర ప్రజల కోసమా… వ్యక్తిగతమా?

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర రాష్ట్ర ప్రజల కోసమా వ్యక్తిగతమా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందారెడ్డి కేసులో సీబీఐ జగన్ కుటుంబసభ్యుడిని అరెస్ట్ చేయబోతుందని జగన్కు భయం పట్టుకుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో సీబీఐనీ ఏదో అదృశ్యశక్తి అడ్డుకుంటోందని అన్నారు. బెయిల్ రద్దవకూడదని కేంద్ర హోమంత్రి అమిత్ షాను జగన్ వేడుకున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని కట్టడి చేయాలని అమిత్ షాని కోరారు అని నిలదీశారు.