మూడో దశ ముప్పు ఉన్నందున…జిల్లాకు వెయ్యి

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున జిల్లాకు వెయ్యి పడకల చొప్పున సిద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అన్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువుల బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు.