రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ… టీడీపీ

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్షం భేటీ అయ్యింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ శాసనసభాపక్షం (టీడీఎల్పీ) నిర్ణయించింది. రేపు గురువారం (20వ తేదీ) సాయంత్ర 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ఎల్లుండి (21వ తేదీ) శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నట్టు టీడీఎల్పీ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.