ముందుగా ఎమ్మెల్యేని .. ఆ తరువాతే స్పీకర్ని
నేను ముందుగా ఎమ్మెల్యేని, ఆ తరువాతే స్పీకర్ని. నా నియోజకవర్గం సంక్షేమం కోసం అధికారులతో సమీక్షిస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ తమ్మినేని సీతారాం ఆగ్రహంతో ఉగిపోయారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బి.కంచరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం నాకు లేదా? అని అడిగారు. అసలు స్పీకర్ సమీక్షలు నిర్వహించకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉందని ప్రశ్నించారు. గౌరవ వేతనంతో నియమించిన వలంటీర్లకు భవిష్యత్లో టైమ్ స్కేల్ వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు అని ప్రకటించారు.













