ఆర్టీజీఎస్ను సందర్శించిన రాష్ట్రపతి రామ్నాథ్
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అమరావతిలోని సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం (ఆర్టీజీఎస్)ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులను చంద్రబాబు పరిచయం చేయగా, రాష్ట్రపతి వారితో కరచాలనం చేశారు. అనంతరం ఆర్టీజీఎస్ కేంద్ర విశేషాలను చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో ఫైబర్ నెట్ కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.













