శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహనసేన వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చినజీయర్, టీటీడీ న్యాయాధికారి వై.వీర్రాజు, జిల్లా ప్రొటోకాల్ న్యాయమూర్తి ఎం.గురునాథ్, ప్రొటోకాల్ మున్సిఫ్ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.






