మురళి ఫార్చున్ హోటల్కు చేరుకున్న పవన్ కళ్యాణ్..!!
పవన్ వస్తుండగా సీఎం, సీఎం అంటూ నినాదాలు ఇచ్చిన జనసేన కార్యకర్తలు
ఉద్దానం బాధితుల సమస్యను వెలుగులోకి తీసుకురావాలని వచ్చాను.
ఉద్దానం సమస్యలను రాజకీయం చెయ్యాలని నేను అనుకోవడం లేదు.
రాజకీయ ఆరోపణలు చెయ్యటం వలన లబ్ది పొందాల నుకోలేదు.మనుషులను విడకొట్టే రాజకీయాలు కాదు కావాల్సింది మనుషులను కలిపే రాజకీయాలు కావాలి సమకాలీన రాజకీయాలు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. బాధితుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి స్పందించారు.కిడ్నీ సమస్యలపై త్వరగా ఎవ్వరు తెలుసుకోలేరు.
హార్వర్డ్ బృందంతో మాట్లాడినప్పుడు మా వంతు సాయం చేస్తాము అని చెప్పారు.
ముఖ్యమంత్రి గారు స్పందించి 5 కోట్లు కేటాయించారు. ఉద్దానం అనేది నన్ను వ్యక్తిగతంగా కదిలించింది. నా మొదటి గెలుపుగా భావిస్తున్నాను.అక్కడ స్థానిక రాజకీయాల వలన ఆ సమస్య బైటకి రాలేదు.నాపోరాటానికి మద్దతు తెలిపిన అందరికి నా ధన్యవాదాలు.ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ముందుకు రావడం లేదు.
ఇప్పటికే మేము ప్రతిభావంతులను మా కార్యకర్తలను నియమిస్తాము.
అక్టోబర్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను.నాసమయంలో 3వంతుల సమయం రాజకీయాలకు కేటాయిస్తాను.Gst గురించి కూడా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాను ,నేతన్నల గురించి ప్రస్తావించాను కేంద్రం పరిధిలో ఉన్న అంశం అని వారన్నారు .గరగపర్రు అంశంపై నేను మాట్లాడను.విభజన రాజకీయాలకు నేను వ్యతిరేకం.సున్నిత అంశాన్ని నేను పెద్దది చేయలేను. నేను ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాలంటే అక్కడకు ఏ శక్తులు వస్తాయో అని భయం వేస్తోంది.జాతీయ ఉద్యమకారులకు కులాన్ని
ఆపాధిస్తున్నారు.గాంధీజీ కీ,అల్లూరికి కులాన్ని ఆపాదించటం సరికాదు.
దేశంకోసం పనిచేసిన అంబేద్కర్ లాంటి గొప్పవ్యక్తిని ఒక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి గా చూడరాదు.దళిత వర్గాలు కూడా ఆలోచించాలి సమాజాన్ని సరిదిద్దటంలో అందరి పాత్ర ఉండాలి.
నేను ఎక్కడికి వెళ్తానో అక్కడ కులాన్ని అడ్డం పెడతారని నేను వెళ్లటంలేదు.
గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ గురించి ప్రజలకు వివరించాలి.
మన రాష్ట్రంలో అందరూ వృత్తిపై ఆదారపడిన వాళ్ళు.కాపు రిజర్వేషన్ అనేది సున్నితమైన అంశం.నేను ఆకులానికి చెందిన వాడిని.రిజర్వేషన్లు అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం .కాపు రిజర్వేషన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించవద్దు. ప్రజాస్వామ్యంలో అందరూ పాదయాత్రలు చేసుకోవచ్చు.నా కారు కూడా నన్ను బైటకి వెల్లనివ్వటం లేదు పాదయాత్ర చేయటం ఎలా చేయాలో అర్థం కావడం లేదు.గరగపర్రు వెళ్లేందుకు కొన్ని ఇబ్బందులు నాకు ఉన్నాయి.mj అక్బర్ లాంటివాళ్ళు నాకు ఆదర్శం.ముజఫర్ నగర్ లాంటి చోట చిన్న చిన్న గొడవలు జరిగితే ఈగోకు దారి తీసి అదుపు దాటి గొడవలు పెరిగిపోయాయి .అభిమానుల సీఎం అంటుంటే నేను పెద్దగా పట్టించుకోను.గరగపర్రులో దళితులకు వేసిన వెలిని నేను ఖండిస్తున్నాను.చట్టం అనేది దేశం అంతా ఒకేలా ఉండాలి కానీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉండకూడదు.













