Nara Lokesh: సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్

అధికారులతో ప్రారంభమైన సమావేశం. నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించిన ఏపీ భవన్ అధికారులు. ఇప్పటి వరకూ 215 తెలుగువారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆదేశాలు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించిన మంత్రి నారా లోకేష్.
ప్రతి రెండు గంటలకు నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం. నేపాల్ లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో విడియో కాల్ లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. నేపాల్ లో చిక్కుకున్న సూర్య ప్రభ తో మాట్లాడిన లోకేష్. అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించిన సూర్య ప్రభ. ముక్తి నాథ్ దర్శనానికి వెళ్ళి ఒక హోటల్ లో చిక్కుకున్నాం అని చెప్పిన సూర్య ప్రభ. హోటల్ నుండి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు చేసి మిమ్మల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా.