కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి శంకరనారాయణ భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సమావేవమయ్యారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ- భోగాపురం ఎయిర్పోర్టుకు ఆరు లేన్ల రహదారి, కడప రేణిగుంట రహదారి నిరాణాలకు అవసరమైన నిధుల గురించి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతపురం, చిత్తూరుతో పాటు ఇతర జిల్లాలోని ముఖ్యమైన అంతరాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. తాము కోరిన అన్నింటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్తో కలిశారు.