ఎపిలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన తైవాన్ కంపెనీలు
పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీఐఐసీ కార్యాలయంలో తైవాన్ డైరెక్టర్ జనరల్తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎస్ఏ వాల్సిస్ 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పక్రియ మొత్తం పూర్తయ్యాకే పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రకటన వెలువడుతుంది. ఏపీలో ‘ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్’ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తైవాన్ ఆసక్తి చూపుతోంది. రూ.15వేల కోట్లతో విశాఖలో అదానీ డేటా సెంటర్ పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే ఎస్ఐపీబీ సమావేశంలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. సెమీ కండక్టర్కు పెద్దపీట వేసే తైవాన్ కంపెనీలతో చర్చలు తొలిదశలో ఉన్నాయి. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాకే పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది.













