కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం 5వ రోజు కార్యక్రమాలు
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా తేదీ -19.08 2022 న ఐదవ రోజు ఉదయం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, హస్త్ర హోమం, దిశా హోమం, అగ్ని సంగ్రహణం, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది, సాయంత్రం సోమకుంభపూజ, కుంభాలంకారం, కళాకర్షణం, మొదలగును పూజలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికార శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేచ్చకులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.













