కియా రూ.5 కోట్ల విరాళం..

ఆంధప్రదేశ్లో కొవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయ చర్యలు చేపట్టేందుకు ఆంధప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థకి (ఏపీఎస్డిఎంఏ) కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన నిధులను ఆక్సిజన్ కాన్సన్టేట్రర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు తదితర వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబందించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జ్యూడ్ లి, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ టి.సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.